ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ‘రైతు భరోసా’ ప్రారంభోత్సవానికి రావాలని మోదీని జగన్ ఆహ్వానించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిన నిధుల వివరాలను మోదీకి జగన్ తెలియజేశారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి అవసరమైన నిధులు ఇవ్వాలని, విశాఖ- కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని మోదీకి జగన్ వినతిపత్రం ఇచ్చారు.