వడ్డీ రేట్లను వరుసగా అయిదోసారి తగ్గించింది ఆర్బీఐ. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐ ఈ చర్యలను ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లతో రెపో రేటును తగ్గించినట్లు ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. 5.40 శాతం ఉన్న రెపో రేటును 5.15 శాతానికి తగ్గించింది. దీంతో జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్బీఐ భావిస్తున్నది. ఆర్థిక వృద్ధిని సాధించేందుకు వీలైనన్ని రోజులు ఇదే స్థితిని కొనసాగించనున్నట్లు ఆర్బీఐ చెప్పింది. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. రివర్స్ రెపో రేటును కూడా 4.9 శాతానికి తగ్గించారు.
