ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడును సందర్శించనున్నారు: కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వారి తో పాటు ప్రచారం లో పాల్గొంటారు
తమిళనాడు: బీజేపీ పై తమిళనాడు లో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ, పార్టీ రాష్ట్రం కోసం, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి గురించి తెలియజేస్తూ ఈ నెల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది .
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు, ప్రచారం ప్రారంభిస్తారు . కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమిళనాడులో బిజెపి ఎన్నికల ప్రచారంలో చేరనున్నారు.
21 ఎకరాల ప్రైవేట్ భూమిలో ప్రజా సమావేశం జరుగనుంది. పార్టీ ప్రచారం ఫిబ్రవరి 10, 19 తేదీలలో తిరుప్పూర్, చెన్నై, కన్యాకుమారిలలో జరుగుతుంది.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ, తమిళ నాడు ప్రజలందరికి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను తెలియజేయనుంది . తమ ప్రచారంలో బీజేపీ, ప్రజలకి వాస్తవాలను తెలియజేయటం వల్లన, ప్రచారం తరువాత, నరేంద్ర మోదీ మరియు బీజేపీ పార్టీ తమ బలాన్ని పెంచుకుంటారని ఆశిస్తున్నారు.
