దిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర అటవీశాఖ నుంచి ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. దిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జావడేకర్ చెక్కును బాలినేనికి అందజేశారు.
