తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 6 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,922 మంది భక్తులు దర్శించుకోగా, 26,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు.
