బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకాశం లేకుండా పోతుంది. జోబులో డబ్బుతో పాటు ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్లి బార్ లో ఇచ్చి మద్యం సేవించాలి. మద్యం కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు కావాలనే చట్టం తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యిందని సమాచారం. పీకలదాక తాగితే వారిని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలని, వారి కుటుంబ సభ్యులకు ఫ్రీగా సరుకులు ఇవ్వాలని ఓ ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇది జోక్ కాదు, నిజం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
