పాకిస్థాన్ పాత అలవాట్లనే కొనసాగిస్తోంది. విదేశీ సంబంధాల విషయంలో తీరు మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన వ్యవహారాలో పాకిస్థాన్ పద్ధతి సరిగా లేదంటూ భారత విదేశాంగ శాఖ అన్నది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమానాన్ని తమ గగన తలం నుంచి అనుమతించబోమని పాకిస్థాన్ ప్రకటించడం సమంజం కాదని, ఈ విషయంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు ఫిర్యాదు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్ వాస్తవాన్ని గుర్తించి తన పద్ధతి మార్చుకుంటుందని ఆశిస్తున్నాం. లేదంటే ఫిర్యాదు చేయక తప్పదని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విజ§్ు గోఖలే స్పష్టం చేశారు. వారం రోజుల పర్యటన కోసం మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. అయితే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ భారత్పై రగిలిపోతున్నది. అందులో భాగంగానే తమ గగన తలంలోకి భారత విమానాలను నిషేధించింది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ప్రయాణించే విమానాన్ని అనుమతించలేదు. తాజాగా ప్రధాని ప్రయాణించే విమానాన్ని కూడా అనుమతించమని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకుని అంతర్జాతీయ సమాజంలో తానూ భాగంగా వ్యవహరించాలని హితవు పలికింది.
