దిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఈరోజు ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన భారత ఆర్మీ తూర్పు విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. ఆగస్టు 31న జనరల్ దేవ్రాజ్ అన్బూ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలోకి మనోజ్ ముకుంద్ వచ్చారు. ‘ఆపరేషన్ పవన్’ సమయంలో శ్రీలంకకు పంపిన పీస్ కీపింగ్ ఫోర్స్లో మనోజ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన అనేక ఉగ్రవాద నిరోధక చర్యల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కశ్మీర్లో ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం సేనా మెడల్, అస్సాం రైఫిల్స్లో కీలకంగా వ్యవహరించినందుకుగానూ విశిష్ఠ సేవా మెడల్తో సత్కరించింది.
