ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో భాగంగా విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కొన్ని నెలల క్రితమే బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేశారు. ఇప్పుడు మరో 10 బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆ పది బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్లో పునాదులు వేసుకుని, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలు ఉన్న ఆంధ్రా బ్యాంకు కూడా ఉంది. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
